తండ్రిపై కక్ష.. తమిళనాడులో 8 ఏళ్ల చిన్నారి దారుణ హత్య

తమిళనాడులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 8 ఏళ్ల చిన్నారిని ఇద్దరు వ్యక్తులు అతి దారుణంగా చంపేశారు. బాలిక తండ్రిపై ఉన్న కక్ష కారణంగా చిన్నారిని హతమార్చారు. ఈ ఘటనలో..

తండ్రిపై కక్ష.. తమిళనాడులో 8 ఏళ్ల చిన్నారి దారుణ హత్య
Follow us

|

Updated on: Jul 16, 2020 | 2:33 PM

తమిళనాడులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 8 ఏళ్ల చిన్నారిని ఇద్దరు వ్యక్తులు అతి దారుణంగా చంపేశారు. బాలిక తండ్రిపై ఉన్న కక్ష కారణంగా చిన్నారిని హతమార్చారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. తమిళనాడులోని ట్యుటికోరిన్‌ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. పూర్తి వివరాలు పరిశీలించగా..

తమిళనాడులోని ట్యుటికోరిన్‌ జిల్లాకు చెందిన ఇద్దరు రెండు కుటుంబాల మధ్య తగదా కారణంగా చిన్నారిని బలితీసుకున్నారు. టీవీ పెట్టాలని అడిగినందుకు ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా హతమార్చాడో దుర్మార్గుడు. తమ ఇంట్లో టీవీ లేకపోవడంతో పక్కింటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంటి యజమాని తన తండ్రితో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో బాలిక టీవీ పెట్టమని అడగడంతో ఆ కోపాన్ని చిన్నారిపై చూపించాడు. కత్తితో చిన్నారి గొంతుకోసి చంపి ఓ డ్రమ్‌లో పెట్టాడు. సమీపంలో గల ఓ వంతెనపై నుంచి నీటిలోకి విసిరేశాడు.

చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టగా..అసలు విషయం బయటపడింది. తండ్రితో గొడవ కారణంగా పక్కింటి వ్యక్తే చిన్నారిని హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.