తమిళనాడులో కొత్తగా 3,827 కేసులు..61 మరణాలు..

తమిళనాడులో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటిగా ఉంది. తొలుత మహారాష్ట్ర ఉండగా..

తమిళనాడులో కొత్తగా 3,827 కేసులు..61 మరణాలు..
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2020 | 7:10 PM

తమిళనాడులో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటిగా ఉంది. తొలుత మహారాష్ట్ర ఉండగా.. ఆ తర్వాత తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక తమిళనాడులో తాజాగా మరో 3,827 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,14,978కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 61 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 1,571కి చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 46,883 యాక్టివ్ కేసులు ఉన్నాయని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.