చెన్నైలో విషాదం..భార్య లేదనే మనస్తాపంతో భర్త ఆత్మహత్య
చెన్నై రానిపెట్ట జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు తండ్రి. వాలాజ రోడ్ రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ముగ్గురు మృతి చెందారు. భార్య చనిపోయిందనే మనస్థాపంతో..ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు భర్త.షోలింగర్ గ్రామానికి చెందిన వెంకటేష్, నిర్మల దంపతులు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ కలహాలతో రెండ్రోజుల క్రితం భార్య ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇంతలోనే ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. భార్య లేని […]
చెన్నై రానిపెట్ట జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు తండ్రి. వాలాజ రోడ్ రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ముగ్గురు మృతి చెందారు. భార్య చనిపోయిందనే మనస్థాపంతో..ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు భర్త.షోలింగర్ గ్రామానికి చెందిన వెంకటేష్, నిర్మల దంపతులు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ కలహాలతో రెండ్రోజుల క్రితం భార్య ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇంతలోనే ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. భార్య లేని జీవితం ఎందుకనుకున్న భర్త..ఎవరూ లేని సమయంలో రైలు కింద పడి బిడ్డలతో సహా తన జీవితాన్ని కూడా ముగించాడు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.
.