కరోనా చికిత్సకు ఇంతే తీసుకోవాలి…

కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ ఆస్పత్రులలో కోవిడ్-19 చికిత్సకు నిర్ణీత ధరలను నిర్ణయించింది.

కరోనా చికిత్సకు ఇంతే తీసుకోవాలి...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 06, 2020 | 6:57 PM

కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ ఆస్పత్రులలో కోవిడ్-19 చికిత్సకు నిర్ణీత ధరలను నిర్ణయించింది. కరోనా లక్షణాలు లేని వారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారిని ఏ1, ఏ2 కేటగిరీలుగా ప్రభుత్వం వర్గీకరించింది. ఏ1,ఏ2 కేటగిరి రోగుల చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులు రూ.7500 ఫీజును నిర్ణయించింది. ఏ3, ఏ4 కేటగిరి జనరల్‌ వార్డు రోగుల నుంచి రూ.5000 ఫీజును వసూలు చేయడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. కాగా ఏ1, ఏ2, ఏ3, ఏ4 కేటగిరీలకు సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రులలో ఐసీయూ విభాగానికి మాత్రం రూ.15000 వసూలు చేసుకోవచ్చని తెలిపింది. కరోనా చికిత్సకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని బాధితుల ఫిర్యాదుతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.