Jallikattu : తమిళ తంబిల విజ్ఞపికి సర్కార్ ఓకే చెప్పింది..నిబంధనలు పాటించాలంటూ ఓ ట్విస్ట్ పెట్టింది
తమిళనాడులో ఈ ఏడాది కూడా దుమ్మురేపబోతోంది జల్లికట్టు. అనుమతిస్తారా లేదా అన్న సస్పెన్స్కు పళని సర్కారు తెరదించింది. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు వచ్చే ఏడాది నిర్వహించుకునేందుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
Jallikattu Allowed : తమిళనాడులో ఈ ఏడాది కూడా దుమ్మురేపబోతోంది జల్లికట్టు. అనుమతిస్తారా లేదా అన్న సస్పెన్స్కు పళని సర్కారు తెరదించింది. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు వచ్చే ఏడాది నిర్వహించుకునేందుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ బుల్ రేసులో 150 మంది వరకు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని తెలిపింది. అందరూ సామాజిక దూరం పాటిస్తూ థర్మల్ స్క్రీనింగ్, మాస్కు నిబంధనలు పాటించాలని చెప్పింది. 50 శాతం పరిమితితో వీక్షకులకు అనుమతులిచ్చింది. అందరూ సమాజిక దూరం పాటిస్తూ థర్మల్ స్క్రీనింగ్, మాస్కు నింధనలు పాటించాలని చెప్పింది. జనవరి, మే నెలల్లో పోటీలను నిర్వహిస్తారు.
గతంలో ఓ లెక్క…ఇప్పుడో లెక్క అన్నట్లు.. కరోనా వచ్చాక పండగలన్నీ బోసిపోతున్నాయి. సంబరాలు సోసోగా ముగుస్తున్నాయి. దీంతో వైరస్ ఎఫెక్ట్తో అసలీసారి జల్లికట్టు ఉంటుందా.. ఒకవేళ ఉన్నా… మనుపటి కోలాహలం ఉంటుందా అన్న డౌటొచ్చింది.
కరోనా నిబంధనలను కొంతమేర సడలించాలనే జల్లికట్టు కమిటీల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వం పచ్చజెండా ఊపటంతో వచ్చే జనవరిలో తమిళనాట జోర్దార్గా జరగబోతోంది జల్లికట్టు. నిబంధనలకు అనుగుణంగా జల్లికట్టు నిర్వహణకు అనుమతిస్తూజ ప్రభుత్వం అడ్వైజరీ రిలీజ్ చేసింది.
జల్లికట్టులో పాల్గొనే ఆటగాళ్ల సంఖ్య 150నుంచి 300కు మించకూడదని ఆంక్షలు విధించింది. అదే సమయంలో జల్లికట్టును వీక్షించేందుకు వచ్చేవారి సంఖ్య కూడా 50శాతమే ఉండాలని కండిషన్ పెట్టింది. జనవరి 15నుంచి 17దాకా మూడురోజులపాటు జల్లికట్టుకు మైదానాలు ముస్తాబవుతున్నాయి.
సంప్రదాయిక క్రీడకు సరేనంటూనే.. మరోవైపు కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది తమిళనాడు ప్రభుత్వం. కరోనావ్యాప్తిని నిరోధించేందుకు.. డిసెంబరు 31 రాత్రి, జనవరి 1న బీచ్లు, హోటళ్లు, క్లబ్బులు, రిసార్టుల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ని బ్యాన్ చేసింది.