తమిళనాడులో కొత్తగా 5,967 కరోనా కేసులు నమోదు
తాజాగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 5,967 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 97 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,85,352కి, మరణాల సంఖ్య 6,614 కి చేరింది. కాగా, గత 24 గంటల్లో 6047 మంది కరోనా నుంచి..
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిత్యం పెరుగుతున్న కేసులతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు ప్రజలు. ఇప్పటికే నిత్యం పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతూనే ఉంటున్నారు. ఇక కేసుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలోకి చేరింది భారత్. అటు, తమిళనాడులో కూడా కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ ఐదు వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 5,967 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 97 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,85,352కి, మరణాల సంఖ్య 6,614 కి చేరింది. కాగా, గత 24 గంటల్లో 6047 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3,25,456 మంది కోలుకోగా, ప్రస్తుతం 53,282 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
Tamil Nadu reports 5,967 new COVID-19 cases and 97 deaths today, taking total cases to 3,85,352 including 3,25,456 discharges and 6,614 deaths. Number of active cases stands at 53,282: State Health Department pic.twitter.com/oekKuMd0Ie
— ANI (@ANI) August 24, 2020
Read More:
బ్రేకింగ్: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనున్న సోనియా గాంధీ
సరదాగా చేపలు పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే