జక్కన్నపై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు.. రాజమౌళి నుంచి ఫోన్ వచ్చిందంటే..!
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మూవీ షూటింగ్లకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చినప్పటికీ, సినీ ప్రముఖులు మాత్రం సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధంగా లేరు.
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మూవీ షూటింగ్లకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చినప్పటికీ, సినీ ప్రముఖులు మాత్రం సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధంగా లేరు. కాస్త పరిస్థితులు చక్కబడ్డాకే షూటింగ్లు ప్రారంభించడం మంచిదన్న ఆలోచనలో అందరు ఉండటంతో.. సినీ ప్రముఖులందరూ ఇంకా ఇళ్లలోనే ఉన్నారు. దీంతో బాగా బోర్గా ఫీల్ అవుతున్నామని, సెట్స్ మీదికి వెళ్లేందుకు ఎదురుచూస్తున్నామని పలువురు నటీనటులు సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు.
కాగా ఈ లాక్డౌన్ రోజులను బాగా ఎంజాయ్ చేశానని చెప్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. కెరీర్ పరంగా ఇన్ని రోజులు బిజీగా గడిపానని, ప్రస్తుతం కామ్గా ఉండి చిల్ అవుతున్నానని ఆమె తెలిపింది. ఇంట్లోనే కూర్చొని ఉండటం మొదట్లోకాస్త ఇబ్బందిగా అనిపించినా.. సాధారణ జీవితాన్ని గడిపేందుకు తన తల్లి తనకు గైడ్ చేసిందని ఆమె అన్నారు. ఈ సమయంలో భగవద్గీత, దుర్గా మాత పుస్తకాలు చదువుతున్నానని తమన్నా పేర్కొన్నారు.
ఇక దర్శకధీరుడు రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ఒకసారి తనతో పనిచేశారు కదా అని నటీనటులకు ఆయన మరో అవకాశం ఇవ్వరు. తను అనుకున్న పాత్రకు ఎవరైతే కరెక్ట్గా సరిపోతామని భావిస్తేనే రాజమౌళి నటీనటులకు అవకాశం ఇస్తారని తమన్నా వెల్లడించారు. ఒకవేళ ఎవరికైనా ఆయన దగ్గరి నుంచి ఫోన్ వచ్చిందంటే.. ఆ పాత్ర కచ్చితంగా వారికి రాసినట్లే అని తమన్నా తెలిపారు. కాగా గతేడాది ఎఫ్ 2, సైరాలతో మంచి విజయాలను ఖాతాలో వేసుకున్న తమన్నా.. ప్రస్తుతం గోపిచంద్ సరసన సిటీమార్లో, హిందీలో నవాజుద్దీన్ సరసన బోలే చుడియాన్లో నటిస్తున్నారు.