భద్రతా బలగాలే లక్ష్యంగా విరుచుకుపడ్డ తాలిబన్లు
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మారణహోమం సృష్టించారు. భద్రతా బలగాల ఔట్ పోస్టులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 42 మంది ఆఫ్ఘన్ భద్రతా సిబ్బంది ప్రాణాలు విడిచారు. అనేక మంది గాయాలపాలయ్యారు. గాయాలపాలైన భద్రతా సిబ్బంది ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్లోని నహ్రీన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సౌత్ కాందహార్ ప్రావిన్స్, తఖ్తా పోల్ తదితర ప్రాంతాల్లో తాలిబన్లు జరిపిన కాల్పుల్లో భద్రతా బలగాలు నేలకొరిగారు. అయితే ఇటీవల వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందుతున్న తాలిబన్లను […]
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మారణహోమం సృష్టించారు. భద్రతా బలగాల ఔట్ పోస్టులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 42 మంది ఆఫ్ఘన్ భద్రతా సిబ్బంది ప్రాణాలు విడిచారు. అనేక మంది గాయాలపాలయ్యారు. గాయాలపాలైన భద్రతా సిబ్బంది ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్లోని నహ్రీన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సౌత్ కాందహార్ ప్రావిన్స్, తఖ్తా పోల్ తదితర ప్రాంతాల్లో తాలిబన్లు జరిపిన కాల్పుల్లో భద్రతా బలగాలు నేలకొరిగారు. అయితే ఇటీవల వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందుతున్న తాలిబన్లను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. దీనికి ప్రతీకారంగాణే ఈ దాడి జరిగిఉండొచ్చని భావిస్తున్నారు.