అందుకే బాబు ఢిల్లీకి వెళ్లాడు: తలసాని ఎద్దేవా
ఈవీఎంలను రద్దు చేయాలని, 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేస్తూ బీజేపీయేతర పార్టీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆదివారం సమావేశమైన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కామెంట్లు చేశారు. ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించే ఢిల్లీకి పారిపోయి కుంటిసాకుగా ఈవీఎంలపై రాద్ధాంతం చేస్తున్నారని తలసాని అన్నారు. ఓటమి గురించి […]
ఈవీఎంలను రద్దు చేయాలని, 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేస్తూ బీజేపీయేతర పార్టీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆదివారం సమావేశమైన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కామెంట్లు చేశారు.
ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించే ఢిల్లీకి పారిపోయి కుంటిసాకుగా ఈవీఎంలపై రాద్ధాంతం చేస్తున్నారని తలసాని అన్నారు. ఓటమి గురించి తెలిసే ఈవీఎంలపై చంద్రబాబు దుమ్మెత్తి పోస్తున్నారని ఆయన విమర్శించారు. టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ తానేనని చెప్పుకునే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఈవీఎంలపై రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.