Delhi Violence : ఐబీ అధికారి హత్య కేసులో ఆప్ నేతపై ఎఫ్ఐఆర్.. పార్టీ నుంచి సస్పెండ్

దేశ రాజధాని ఢిల్లీలో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే. మరోవైపు అనుకూలంగా కూడా మరికొందరు ర్యాలీలు చేయగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు 38 మంది మృతిచెందగా..వీరిలో ఓ కానిస్టేబుల్‌తో పాటుగా.. ఐబీ అధికారి అంకిత్ శర్మ కూడా మరణించాడు. కాగా.. కొందరు దుండగులు అంకిత్ శర్మాను అతి కిరాతకంగా హతమార్చారు. చాంద్‌బాగ్ ప్రాంతంలో అంకిత్ […]

Delhi Violence : ఐబీ అధికారి హత్య కేసులో ఆప్ నేతపై ఎఫ్ఐఆర్.. పార్టీ నుంచి సస్పెండ్
Follow us

| Edited By:

Updated on: Feb 27, 2020 | 11:13 PM

దేశ రాజధాని ఢిల్లీలో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే. మరోవైపు అనుకూలంగా కూడా మరికొందరు ర్యాలీలు చేయగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు 38 మంది మృతిచెందగా..వీరిలో ఓ కానిస్టేబుల్‌తో పాటుగా.. ఐబీ అధికారి అంకిత్ శర్మ కూడా మరణించాడు. కాగా.. కొందరు దుండగులు అంకిత్ శర్మాను అతి కిరాతకంగా హతమార్చారు.

చాంద్‌బాగ్ ప్రాంతంలో అంకిత్ శర్మ ఓ కాలువలో శవమై కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా దేశరాజధానిలో కలకలం రేగింది. మంగళవారం సాయంత్రం ఇంటినుంచి వెళ్లిన తర్వాత ఆయన ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు కలవరపడ్డారు. ఈ ఘటనలో ఆప్ నేత, కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంకిత్ శర్మ హత్య కేసులో.. తాహిర్ హుస్సేన్ పై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఐపీసీ 302 కింద (హత్యకేసు)గా దయాల్ పూర్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా.. అధికారులు తొలుత రాళ్లదాడిలో ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావించినా.. అంకిత్ శర్మ కుటుంబ సభ్యులు మాత్రం.. ఆప్ కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్‌ సహా.. మరికొందరు శర్మను హతమార్చారని ఆరోపించారు. మరోవైపు ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్యలో తన ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని.. వాటికి ఎలాంటి ఆధారాలూ లేవన్నారు.

మరోవైపు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాహీర్ హుస్సేన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంకిత్ శర్మ హత్య కేసులో ఆరోపణలు రావడంతో పాటు ఆయనపై కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఢిల్లీ చాంద్‌బాగ్ ప్రాంతంలో జరిగిన అల్లర్లకు తాహిర్ హుస్సేన్ కర్మాగారం, నివాసం కేంద్రాలుగా మారినట్లు పోలీసులు పక్కా ఆధారాలను సేకరించారు. తాహిర్ నివాసంపైకెక్కిన వందలాది మంది ఆందోళనకారులు..పెట్రోల్, యాసిడ్ బాంబులు విసిరిన దృశ్యాలను సేకరించారు.

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు