నవమోసాలు మోసి.. కనిపెంచిన తల్లిపట్ల కర్కశంగా వ్యవహరించారు ఆ కసాయి కొడుకులు. 90 ఏళ్ల వయస్సులో ఉన్న అమ్మను కంటికి రెప్పలా చూసుకోవల్సిన సుపుత్రులే ఆమెను నిర్దాక్షిణ్యంగా రోడ్డునపడేశారు. ఆ తల్లి బిడ్డలకు భారమైందేమో తీసుకొచ్చి అడవి పక్కన వదిలేశారు. తల్లి పట్ల వారు వ్యవహరించిన తీరు మానవత్వానికే మాయని మచ్చగా మారింది.