తెలుగు వార్తలు » Eligible farmers
రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. రైతులను నిర్లక్ష్యం చేస్తే ఏమాత్రం ఊరుకునేది లేదని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అర్హత ఉన్న రైతుకు రైతు బంధు పథకం కింద నగదు అందకపోతే.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.