తెలుగు వార్తలు » Delhi Violance
ఢిల్లీ అల్లర్ల సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ మృతికి కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత తాహిర్ హుసేన్ ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. అంకిత్ శర్మ మృతి కేసులో నిందితుడైన ఈయన పోలీసుల ముందు లొంగిపోయేందుకు రెడీ అయ్యాడు.
ఢిల్లీ హింసపై సోమవారం లోక్ సభ అట్టుడికింది. ఇటీవల ఈ నగరంలో జరిగిన హింసాకాండపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండు చేస్తూ..సభా కార్యకలాపాలను స్తంభింప జేయడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.