తిరుమల శ్రీవారిని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి సింధు.. స్వామి వారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో సింధుకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామి వారి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. �
బెంగుళూరు: ఏరో ఇండియా -2019 షోలో నేడు వుమెన్స్ డే నిర్వహిస్తున్నారు. ఏవియేషన్ రంగంలో మహిళలు సాధించిన ప్రగతికి నిదర్శనంగా ఇవాళ ప్రత్యేకంగా ఏరో ఇండియా ప్రదర్శనలో మహిళా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తేజస్ యుద్ధ విమానంలో విహరించారు.