ముంబయి: జెట్ ఎయిర్వేస్కు కష్టాలు కొనసాగుతున్నాయి. తాజాగా జెట్ ఎయిర్వేస్ పైలట్లకు సంబంధించిన నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ సమ్మెసైరన్ మోగించింది. మార్చి1వ తేదీ నాటికి జీతాల చెల్లింపుపై స్పష్టతను ఇవ్వకపోతే సమ్మెకు దిగడంతోపాటు తమ సంస్థ సభ్యులు కచ్చితంగా రోస్టర్ విధానానికి కట్టుబడి ఉండాలని కోరతామని పేర్కొంది.