'ఫ్యుజిటివ్ బిజినెస్ మన్' విజయ్ మాల్యా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై ఈ నెల 20 న విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదలాయింపులో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఆయనపై లోగడ కోర్టు ధిక్కార కేసు నమోదైంది.