“కొత్త వారు ఇండస్ట్రీకి రావాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి..”
‘ఝుమ్మంది నాదం’ మూవీతో హీరోయిన్గా సినిమా ప్రస్థానం ప్రారంభించిన తాప్సీకి..ఇక్కడ గ్లామర్ పాత్రలే తప్ప ఎప్పుడూ నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ దక్కలేదు. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ వైపు వెళ్లి సూపర్ క్లిక్ అయ్యింది.
‘ఝుమ్మంది నాదం’ మూవీతో హీరోయిన్గా సినిమా ప్రస్థానం ప్రారంభించిన తాప్సీకి..ఇక్కడ గ్లామర్ పాత్రలే తప్ప ఎప్పుడూ నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ దక్కలేదు. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ వైపు వెళ్లి సూపర్ క్లిక్ అయ్యింది. అక్కడ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎన్నుకుంటూ బ్లాక్ బాస్టర్ విజయాలు అందుకుంటుంది. బడా..బడా స్టార్స్ పక్కన నటిస్తూ..తన టాలెంట్ నిరూపించుకుంటుంది.ఇక కాంట్రవర్సీలు కూడా ఆమెకు కొత్త కాదు. సుశాంత్ సింగ్ సూసైడ్ అనంతరం బాలీవుడ్లో నెపోటిజంపై స్పందించి.. తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావించింది. తనతో పాటు స్వర భాస్కర్ కూడా కష్టాలు ఎదుర్కొందని తెలిపింది. కేవలం కంగనా లాంటి వాళ్లే నెపోటిజంపై ఫైట్ చేస్తున్నారు..తాము కరణ్ జోహార్ వంటి వారికి మద్దతు నిలుస్తున్నట్టు వస్తున్న వ్యాఖ్యలపై కూడా స్పందించింది. మేము కరణ్ జోహార్కు వ్యతిరేకం కాదు..అలాగని నెపోటిజానికి మద్దతు నిలవడం లేదని వ్యాఖ్యానించింది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ అనంతరం ఎవరైనా వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడే పరిస్థితులను నెలకొల్పారని వాపోయింది. నెపొటిజం వల్ల ఎంతో టాలెంట్ ఉన్నవారు వెనకే ఆగిపోతున్నారని పేర్కొంది. కానీ కొంత మంది ఆడియెన్స్ వారసత్వంగా వచ్చిన నటీనటుల సినిమాలు చూడడానికే ఇంట్రెస్ట్ చూపెడుతున్నరని కూడా కామెంట్ చేసింది.. అలా అని బాలీవుడ్ మొత్తం నెపోటిజంతో నిండిపోయిందనే వాదనను కూడా ఖండించింది. ఇండస్ట్రీ మొత్తం నెపోటిజం ఉంటే తనలాంటి వాళ్లు ముందుకు రాగలిగే వారా అని ప్రశ్నించింది.
Next time another outstanding talent gets scared to even enter our industry n kills his passion and hope to contribute to Indian cinema coz some people painted purely negative picture about how outsiders are treated do remember YOU are ALSO responsible for it. https://t.co/ity5a4p1zL
— taapsee pannu (@taapsee) July 19, 2020