మార్పు తీసుకొద్దాం.. సలహాలు ఇవ్వండి

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది నుంచి సిలబస్‌తో పాటు పాఠశాల పని గంటల్లో మార్పులు చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో అధ్యాపకులు, విద్యావేత్తలు తమ ఆలోచనలు, సూచనలను కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవాలని కేంద్ర మంత్రి రమేష్ ఫోక్రియల్ కోరారు.

మార్పు తీసుకొద్దాం.. సలహాలు ఇవ్వండి
Follow us

|

Updated on: Jun 09, 2020 | 5:01 PM

కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో పాఠశాలలు, కాలేజీలు తిరిగి తెరిచేది ఎలా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఢిల్లీ, మహారాష్ట్రలాంటి ప్రాంతాలలో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉండటంతో ఈ విద్యాసంవత్సరంను ఎలా మొదలు పట్టాలి అనే అంశం కీలకంగా మారింది. చదువుకు ఆటంకం కలగకుండా.. విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా అనేక మార్గాలను అన్వేషిస్తోంది.

ఇందు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది నుంచి సిలబస్‌తో పాటు పాఠశాల పని గంటల్లో మార్పులు చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో అధ్యాపకులు, విద్యావేత్తలు తమ ఆలోచనలు, సూచనలను కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవాలని కేంద్ర మంత్రి రమేష్ ఫోక్రియల్ కోరారు. #syllabusForStudents2020 హ్యష్ ట్యాగ్‌తో హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీకి ట్విట్టర్,ఫేస్‌బుక్‌లో సూచనలు చేయాలని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇచ్చే సూచనలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని రమేశ్ తెలిపారు.