శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.1.41 కోట్లు
శ్రీశైల మల్లన్న హుండీలను దేవస్థాన అధికారులు తెరిచారు. అష్టాదశ శక్తి ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల మహాక్షేత్రంలో స్వామి అమ్మవార్ల హుండిని లెక్కించారు. దేవస్థానానికి భక్తులు సమర్పించుకున్న..
Srisaila Mahakshetra Hundi : శ్రీశైల మల్లన్న హుండీలను దేవస్థాన అధికారులు తెరిచారు. అష్టాదశ శక్తి ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల మహాక్షేత్రంలో స్వామి అమ్మవార్ల హుండిని లెక్కించారు. దేవస్థానానికి భక్తులు సమర్పించుకున్న ముడుపులు, కానుకలను లెక్కించారు. మొత్తం రూ.1,41,20,481 హుండీ ఆదాయం వచ్చిందని ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.
ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీలతో పాటు పరివార దేవాలయాల హుండీలను కూడా లెక్కించారు. ఆలయ అధికారులు సిబ్బందితో లెక్కింపు చేపట్టారు. కరోనా వైరస్ నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడంతో గత 23 రోజులుగా స్వామి అమ్మ వార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలను కట్టుదిట్టమైన భద్రత, నిఘా నేత్రాల పర్యవేక్షణలో లెక్కింపు జరిగినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.