బాణసంచా నిషేధంపై స్వదేశీ జాగరణ్ మంచ్ ఆగ్రహం
కరోనా తీవ్రత పెరుగుతుండటంతో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చరాదని ప్రభుత్వాలు ఆదేశించింది. దీనిపై స్వదేశీ జాగరణ్ మంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరోనా తీవ్రత పెరుగుతుండటంతో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చరాదని ప్రభుత్వాలు ఆదేశించింది. దీనిపై స్వదేశీ జాగరణ్ మంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాణసంచాపై పూర్తి స్థాయిలో నిషేధం విధించడం సరికాదని తెలిపింది. ఈ సంస్థ జాతీయ సహ సమన్వయకర్త డాక్టర్ అశ్వని మహాజన్ విడుదల చేసిన ప్రకటనలో బాణసంచాపై నిషేధం విధించడాన్ని తప్పుబట్టారు. బాణసంచా వల్ల దుష్ఫలితాలు వస్తాయనే ప్రచారాన్ని నిలిపేయాలని ఆయన కోరారు. పండుగల సాంప్రదాయాలను కాళరాస్తూ.. వాస్తవ సమాచారం లేకుండా ప్రభుత్వాలు బాణసంచాపై నిషేధం విధించడం సరికాదదన్నారు. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చకుండా పూర్తి స్థాయిలో నిషేధం ఎత్తివేయాలని మహాజన్ డిమాండ్ చేశారు.
నిత్యం వాహనాల వల్లే వెలువడే కాలుష్యం కంటే బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యం అంత ప్రమాదకారి కాదని గుర్తు చేశారు మహాజన్. ప్రధానంగా చైనా నుంచి చట్టవిరుద్ధంగా దిగుమతి చేసుకున్న బాణసంచా వల్లే దేశవ్యాప్తంగా విపరీతమైన వాయు కాలుష్యానికి కారణమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చైనా బాణసంచాలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ కలుపుతారని ఆయన వివరించారు. మన దేశంలో తయారయ్యే బాణ సంచా కాలుష్య రహితమైనదని చెప్పారు. మన దేశంలో తయారయ్యే బాణసంచాకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలిపారు. బాణాసంచా నిషేధంపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించుకోవాలని మహాజన్ కోరారు.