తాహిర్ హుసేన్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
సస్పెండయిన ఆప్ నేత తాహిర్ హుసేన్ బెయిలు పిటిషన్ ని ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఈశాన్య ఢిల్లీలో గత్త ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల కేసులో తనను అక్రమంగా ఇరికించారని, తనకు బెయిలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరాడు.ఈ మేరకు గత నెల 29 న పిటిషన్ వేశాడు. అయితే దీన్ని కోర్టు తోసిపుచ్చింది. సీఏఏకి వ్యతిరేకంగా ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో తాహిర్ హుసేన్ తో బాటు మరో ఇద్దరి ప్రమేయం ఉందని పోలీసులు కేసు దాఖలు […]
సస్పెండయిన ఆప్ నేత తాహిర్ హుసేన్ బెయిలు పిటిషన్ ని ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఈశాన్య ఢిల్లీలో గత్త ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల కేసులో తనను అక్రమంగా ఇరికించారని, తనకు బెయిలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరాడు.ఈ మేరకు గత నెల 29 న పిటిషన్ వేశాడు. అయితే దీన్ని కోర్టు తోసిపుచ్చింది. సీఏఏకి వ్యతిరేకంగా ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో తాహిర్ హుసేన్ తో బాటు మరో ఇద్దరి ప్రమేయం ఉందని పోలీసులు కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఘర్షణల్లో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఆ సందర్భంలో తాహిర్ ఇంట్లో పెద్ద ఎత్తున లాఠీలు, కర్రలు, రాళ్లు కూడా పోలీసులు కనుగొన్నారు. తన ఇంటిపై నుంచి ఇతగాడు ఆందోళనకారులను రెచ్ఛగొట్టాడని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇతడ్ని ఆప్ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.