చిన్నమ్మకు నివాళులర్పిస్తూ.. భావోద్వేగానికి గురైన మోదీ
కేంద్ర విదేశాంగశాఖ మాజీ మంత్రి, బీజేపీ నేత సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమెకు నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు సుష్మా ఇంటికి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చిన్నమ్మ ఇంటికెళ్లారు. ఇక సుష్మాను నివాళులర్పించే సమయంలో మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు సానుభూతిని ప్రకటించారు. కాగా ఇవాళ సాయంత్రం జరిగే సుష్మా అంత్యక్రియల్లో మోదీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎస్పీ నేత రామ్ […]
కేంద్ర విదేశాంగశాఖ మాజీ మంత్రి, బీజేపీ నేత సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమెకు నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు సుష్మా ఇంటికి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చిన్నమ్మ ఇంటికెళ్లారు. ఇక సుష్మాను నివాళులర్పించే సమయంలో మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు సానుభూతిని ప్రకటించారు. కాగా ఇవాళ సాయంత్రం జరిగే సుష్మా అంత్యక్రియల్లో మోదీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎస్పీ నేత రామ్ గోపాల్ కూడా సుష్మాకు నివాళులర్పించే సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. ఇక వీరితో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ములాయం సింగ్, బీజేపీ ఎంపీ హేమ మాలిని, ఒమన్ చాందీ, బాబా రాందేవ్ తదిరులు ఆమెకు నివాళులర్పించారు.