దేవుడిపై నమ్మకం ఉంచుదాం: ఫ్యాన్స్‌కి సుశాంత్ సోదరి మెసేజ్‌

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి చెంది దాదాపు నెల కావొస్తుంది. అయితే ఆయన మరణాన్ని అభిమానులు, సన్నిహితులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.

దేవుడిపై నమ్మకం ఉంచుదాం: ఫ్యాన్స్‌కి సుశాంత్ సోదరి మెసేజ్‌
Follow us

| Edited By:

Updated on: Jul 13, 2020 | 3:43 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి చెంది దాదాపు నెల కావొస్తుంది. అయితే ఆయన మరణాన్ని అభిమానులు, సన్నిహితులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, హత్య అని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్‌ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇందుకు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం తమ మద్దతును తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ అభిమానులకు ఆయన సోదరి శ్వేతా సింగ్ కిర్తి సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపారు.

ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసిన శ్వేతా.. ”మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు ఇస్తున్న మద్దతు నన్ను ముగ్ధురాలిని చేసింది. ఈ పరిస్థితుల్లో మీరు మా కుటుంబానికి ఇస్తున్న బలం, మాపై చూపుతున్న ఉదారభావానికి ధన్యవాదాలు చెప్పడం సరిపోదు. దేవుడిపై, ఆయన ఇచ్చే తీర్పుపై నమ్మకం పెట్టుకొందాం. మీరు ఇలానే ప్రార్థించండి” అని తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు సుశాంత్ ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్న ముంబయి పోలీసులు.. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు బాలీవుడ్ ప్రముఖులను విచారించారు. వీరి వద్ద నుంచి వారు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం.