సుశాంత్ మరణం వెనుక దావూద్ ఇబ్రహీం..!
బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణం ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో ప్రకపంనలు రేపుతోంది. అతడి అభిమానులు అసలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణం ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో ప్రకపంనలు రేపుతోంది. అతడి అభిమానులు అసలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక సుశాంత్ మరణానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించి మాజీ ‘రా’ అధికారి ఎన్కె సూద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దావూద్ గ్యాంగ్ సుశాంత్ ను హత్య చేసినట్లు పేర్కొన్నాడు.
దావూద్ ఇబ్రహీం ముఠా సుశాంత్ సింగ్ రాజ్పుత్ను ఫోన్ ద్వారా బెదిరించిందని, దీంతో మానసిక సంఘర్షణను ఎదుర్కున్నాడని ఎన్కె సూద్ చెప్పారు. దావూద్ ముఠా మాత్రమే కాదు, సుశాంత్ సన్నిహితులు కూడా ఈ కుట్రలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.సుశాంత్ ఆత్మహత్యకు ఒక రోజు ముందు సిసిటివి కెమెరాలు ఆగిపోయాయని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, దావూద్ ముఠా నుండి వచ్చే బెదిరింపులను తప్పించుకోడానికి, సుశాంత్ 50 సిమ్ కార్డులను మార్చాడని, రాత్రులు తన కారులో నిద్రించేవాడని సూద్ వివరించారు. సుశాంత్ ఫ్రెండ్, మేనేజర్ సందీప్ సింగ్ ..అనేక మంది బాలీవుడ్ పెద్దల ఈ కుట్రలో భాగస్వాములని మాజీ రా అధికారి ఆరోపించారు.