సుశాంత్ కేసులో మరొకరిని అరెస్ట్ చేసిన ఎన్​సీబీ

సంచలనం సృష్టించిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మరణం కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో  (ఎన్​సీబీ) మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుంది.

సుశాంత్ కేసులో మరొకరిని అరెస్ట్ చేసిన ఎన్​సీబీ
Follow us

|

Updated on: Sep 12, 2020 | 10:59 PM

సంచలనం సృష్టించిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మరణం కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో  (ఎన్​సీబీ) మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. కరన్‌జీత్‌ అలియాస్‌ కేజే అనే ఈ వ్యక్తిని ముంబైలోని బాంద్రా ఏరియాలో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. తమ దర్యాప్తులో భాగంగా బయటపడిన డ్రగ్స్ ముఠాలో కరన్‌జీత్‌ సభ్యుడని ఎన్​సీబీ అధికారులు తెలిపారు. అయితే అతడి వద్ద అరెస్టు సమయంలో డ్రగ్స్ లభించిందీ, లేనిదీ తెలుపలేదు. ఆతడిని దక్షిణ ముంబైలోని తమ ఆఫీసుకు తరలించి ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తాజా అరెస్ట్‌తో కలిపి సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి సంబంధించి అరెస్టుల సంఖ్య 11కు చేరుకుంది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, సుశాంత్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరండా, సహాయకుడు దీపేష్‌ సావంత్‌తో పాటు, డ్రగ్స్‌ విక్రయంతో సంబంధమున్న జాయేద్‌ విలాట్రా, అబ్దెల్‌ బాసిత్‌ పరిహార్‌, కైజన్‌ ఎబ్రహీం, కర్ణా అరోరా, అబ్బాస్‌ లఖానీ, అనుజ్‌ కేశ్వీనీ అరెస్టయిన వారిలో ఉన్నారు.

Also  Read :

“పుస్తెల తాడు తాకట్టు పెట్టైనా”, పులస కొనేస్తున్నారు !

దిగంబర దొంగ ఆట కట్టించిన పోలీసులు