చనిపోయిన రోజు డ్రగ్ డీలర్ని కలిసిన సుశాంత్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పోస్ట్మార్టంలో అతడిది ఆత్మహత్య అని నిర్ధారించినప్పటికీ
Sushant Death Case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పోస్ట్మార్టంలో అతడిది ఆత్మహత్య అని నిర్ధారించినప్పటికీ.. హత్య అన్న అనుమానాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో సుశాంత్ కేసుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ చనిపోయిన రోజు అతడు ఓ డ్రగ్ డీలర్ని కలిసినట్లు స్వామి సంచలన ట్వీట్ చేశారు.
సునంద పుష్కర్ కేసులో ఎయిమ్స్ వైద్యులు ఆమెకు పోస్ట్మార్టం నిర్వహించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. కానీ శ్రీదేవి, సుశాంత్ విషయంలో అలా జరగలేదు. సుశాంత్ మరణించిన రోజు దుబాయితో లింక్లు ఉన్న డ్రగ్ డీలర్ అయాష్ ఖాన్ అతడిని ఎందుకు కలిశాడు..? అని స్వామి ట్వీట్ చేశారు. కాగా మరోవైపు సుశాంత్ కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితాని, సుశాంత్ ఇంట్లో పనిచేసే నీరజ్ సింగ్లను విచారించిన సీబీఐ.. వారిని మరోసారి విచారించాలన్న ఆలోచనలో ఉంది. ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న నటి రియాకు కూడా సీబీఐ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
Read More:
ఉసేన్ బోల్ట్కి పాజిటివ్.. గతవారం గ్రాండ్ పార్టీ ఇచ్చిన స్ప్రింటర్
Like in Sunanda Pushkar case the real give away was what was found in her stomach during post mortem by AIIMS doctors. This was not done for Sridevi or Sushant. In Sushant case a Dubai compliant drug dealer Ayash Khan had met Sushant on the day of Sushant’s murder. Why?
— Subramanian Swamy (@Swamy39) August 24, 2020