రీమేక్‌ కోసం తొలిసారి కలవబోతున్న సోదరులు..!

హీరోలుగా దూసుకుపోతున్న కోలీవుడ్ సోదరులు సూర్య- కార్తి కలిసి ఓ చిత్రంలో నటించాలని వారి అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.

రీమేక్‌ కోసం తొలిసారి కలవబోతున్న సోదరులు..!
Follow us

| Edited By:

Updated on: May 28, 2020 | 3:04 PM

హీరోలుగా దూసుకుపోతున్న కోలీవుడ్ సోదరులు సూర్య- కార్తి కలిసి ఓ చిత్రంలో నటించాలని వారి అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. మంచి స్క్రిప్ట్ దొరికితే  కలిసి నటించేందుకు మేమిద్దరం సిద్ధమేనని ఈ ఇద్దరు కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే కోలీవుడ్ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారట. ఓ రీమేక్‌ కోసం ఈ ఇద్దరు కలవబోతున్నట్లు తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి.

మలయాళ హీరోలు పృథ్వీరాజ్‌, బిజూ మీనన్ నటించిన ‘అయ్యప్పనమ్ కుషియమ్’‌ చిత్రం అక్కడ ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తెలుగులోనూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ రీమేక్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. ఇది పక్కనపెడితే ఇటీవల సూర్య- కార్తి ఈ చిత్రాన్ని చూశారట. ఈ క్రమంలో ఇద్దరికీ ఈ మూవీ నచ్చేయడం, సూర్య రీమేక్‌ హక్కులను తీసుకోవడం కూడా జరిగిపోయాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. అన్నదమ్ములిద్దరు కలిసి నటించే మొదటి చిత్రం ఇదే అవుతుంది.

Read This Story Also: వియత్నాంలో బయటపడ్డ 9వ శతాబ్దపు పురాతన శివలింగం..!