పలు రాష్ట్రాల్లో హై అలర్ట్

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్-2 నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్ సరిహద్దును పంచుకుంటూ ఉన్న పలు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ను ప్రకటించారు. ముఖ్యంగా పాకిస్థాన్ బోర్డర్‌లో ఉన్న ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పరిస్థితిని పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ఆ రాష్ట్ర డీజీపీ అత్యవసరంగా సమావేశమయ్యారు. అటు పంజాబ్ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే భారత్ చేసిన దాడి నేపథ్యంలో ప్రధాని మోడీ, రక్షణ […]

పలు రాష్ట్రాల్లో హై అలర్ట్
Follow us

|

Updated on: Feb 26, 2019 | 11:41 AM

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్-2 నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్ సరిహద్దును పంచుకుంటూ ఉన్న పలు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ను ప్రకటించారు. ముఖ్యంగా పాకిస్థాన్ బోర్డర్‌లో ఉన్న ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పరిస్థితిని పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి.

ఆ రాష్ట్ర డీజీపీ అత్యవసరంగా సమావేశమయ్యారు. అటు పంజాబ్ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే భారత్ చేసిన దాడి నేపథ్యంలో ప్రధాని మోడీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యవసరంగా సమావేశమై చర్చలు జరుపుతున్నారు. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో పలు వ్యూహాలు రూపుదిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది.

పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో వెయ్యి కేజీల బాంబులతో ఉగ్రవాదులపై భారత్ దాడి చేసింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఈ దాడి జరిగింది.

జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన ఈ దాడిలో 200కి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం అందుతోంది. అయితే భారత రక్షణ శాఖ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు పాక్ మాత్రం లైన్ ఆఫ్ కంట్రోల్‌ను దాటుకుని వచ్చిన భారత విమానాలను తిప్పికొట్టామని ప్రకటించుకుంది.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?