దేశమంతా ఒకటే మాట.. మరో భారీ ప్లాన్ సిద్ధం!
న్యూఢిల్లీ: ఇప్పుడు దేశమంతా ఒకటే మాట వినిపిస్తోంది. జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడి 42 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నవారని అంతం చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ వంటి వారితో సహా తగిన గుణపాఠం చెబుతామని వెల్లడించారు. దీంతో ఈ నేపథ్యంలో అంతా సర్జికల్ స్ట్రైక్స్ పైకి చర్చ మళ్లింది. గతంలో 2016లో ఉరి ఉగ్రదాడి ఘటనకు బదులుగా భారత సైన్యం సర్జికల్ […]
న్యూఢిల్లీ: ఇప్పుడు దేశమంతా ఒకటే మాట వినిపిస్తోంది. జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడి 42 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నవారని అంతం చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ వంటి వారితో సహా తగిన గుణపాఠం చెబుతామని వెల్లడించారు. దీంతో ఈ నేపథ్యంలో అంతా సర్జికల్ స్ట్రైక్స్ పైకి చర్చ మళ్లింది.
గతంలో 2016లో ఉరి ఉగ్రదాడి ఘటనకు బదులుగా భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ జరిపి ప్రతీకారం తీర్చుకుంది. శత్రు స్థావరంలోకి ప్రవేశించి మరీ ఉగ్ర మూకలను మట్టుపెట్టింది. ఈసారి కూడా ఈ విధంగానే ఏదొకటి జరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఉరి ఘటన సమయంలో ముందుగా పలు అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ తీరును ప్రధాని ఎండగట్టారు.
ఆయనతో పాటు పలువురు జాతీయ నాయకులు కూడా పలు సందర్భాల్లో పాకిస్థాన్ తీరును ప్రపంచానికి తెలిసేలా మాట్లాడారు. పిరికిపంద చర్య అంటూ మండిపడ్డారు. అనంతరం పథకం ప్రకారం సర్జికల్ స్ట్రైక్స్ జరిపి దెబ్బకు దెబ్బ తీశారు. దీంతో పాక్కు షాకిచ్చి తగిన బుద్ధి చెప్పారు. ఈసారి కూడా అదే తరహాలో ఏదొకటి జరగాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.