గుడ్న్యూస్.. తగ్గిన మాస్క్, పీపీఈ కిట్ల ధరలు
కరోనా నేపథ్యంలో మాస్క్లు, పీపీఈ కిట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో వాటి రేట్లు కూడా అమాంతం పెరిగాయి.
Masks price reduced: కరోనా నేపథ్యంలో మాస్క్లు, పీపీఈ కిట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో వాటి రేట్లు కూడా అమాంతం పెరిగాయి. ఒక్కో సర్జికల్ మాస్క్ రూ.9 నుంచి రూ.13వరకు.. పీపీఈ కిట్ రూ.600 నుంచి రూ.1000 వరకు. కెఎన్95, ఎన్ 95 మాస్కులు రూ.300 నుంచి రూ.400 వరకు అమ్మేవారు. అయితే ఇప్పుడు ఆ ధరలు తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మాస్క్లు, పీపీఈ కిట్ల తయారీ సంస్థలు పెరిగి, ఉత్పత్తి కూడా పెరగడంతో ధరలు పడిపోతున్నాయి. ఇక వీటి రేట్లు తగ్గడంతో ఏపీ ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ఈ నేపథ్యంలో ఓ సంస్థ.. మాస్క్కు రూ.2.36, పీపీఈ కిట్కి రూ.291కు కోట్ చేసింది. ఈ క్రమంలో ముందుస్తుజాగ్రత్తగా 25 లక్షల మాస్క్లు, 10 లక్షల పీపీఈ కిట్లకు ఆర్డర్ ఇచ్చింది.
Read More:
వచ్చే ఏడాది మొదట్లో వ్యాక్సిన్.. మొదట వారికే ప్రాధాన్యం: హర్షవర్ధన్