రైనాపై చెన్నై జట్టు యజమాని సంచలన వ్యాఖ్యలు
చెన్నై సూపర్కింగ్స్ తరఫున ఐపీఎల్ ఆడాల్సిన టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా అనూహ్యంగా ఈ సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే
Suresh Rain IPL 2020: చెన్నై సూపర్కింగ్స్ తరఫున ఐపీఎల్ ఆడాల్సిన టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా అనూహ్యంగా ఈ సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తన పిల్లల కంటే ఏదీ ఎక్కువ కాదని, అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే దుబాయ్లో రైనాకు కేటాయించిన హోటల్ గది నచ్చలేదని అందుకే అసంతృప్తితో వెళ్లిపోయాడని మరో కథనం వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉంటే రైనాపై చెన్నై జట్టు యజమాని ఎన్. శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ”ప్రస్తుత పరిస్థితులపై ధోనీతో మాట్లాడా. ఇంకా ఎవరైన ఆటగాళ్లు వెళ్లిపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదని ధోనీ భరోసా ఇచ్చాడు. అయితే ఎవరు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. ఇష్టం లేకపోతే ఎవరైనా వెళ్లిపోవచ్చు. ఎవర్నీ బలవంతంగా ఏదీ చేయమని అడగము. కొన్నిసార్లు విజయాలు నెత్తికి ఎక్కుతుంటాయి. నాకైతే అద్భుతమైన కెప్టెన్ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టులోని అందరి ఆటగాళ్లతో మాట్లాడి వారికి నమ్మకం కలిగిస్తాడు. నాకు ఎలాంటి భయం లేదు” అని శ్రీనివాసన్ చెప్పారు. ఇక ఈ సీజన్లో ఆడకపోవడం వలన రైనా రూ.11కోట్ల జీతం కోల్పోతాడంటూ శ్రీనివాసన్ వివరించారు.
Read More:
డాలర్ బాయ్ ఒత్తిడితోనే ప్రదీప్, కృష్ణుడి పేర్లు చెప్పా: బాధితురాలు