బీసీసీఐకి చెప్పకుండానే రైనా రిటైర్మెంట్ !
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మరో ప్లేయర్ మిత్రుడు సురేశ్ రైనా ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్యోలు పలికి..ఫ్యాన్స్కు బ్యాక్ టూ బ్యాక్ షాకులు ఇచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మరో ప్లేయర్ మిత్రుడు సురేశ్ రైనా ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్యోలు పలికి..ఫ్యాన్స్కు బ్యాక్ టూ బ్యాక్ షాకులు ఇచ్చారు. అయితే తన వీడ్కోలు గురించి బీసీసీఐకి రైనా ముందుగా చెప్పలేదట. ఒకరోజు ఆలస్యంగా తమకు ఇన్ఫర్మేషన్ అందించాడని బోర్డు తెలిపింది. సాధారణంగా ఏ ప్లేయర్ అయిన తన రిటైర్మెంట్ నిర్ణయం గురించి బీసీసీఐకి ముందుగానే చెప్పడం ఆనవాయితీగా వస్తుంది. సురేశ్ రైనా ఇందుకు భిన్నమైన రూట్లో వెళ్లాడు. ధోనీ ఇన్స్టాగ్రామ్లో వీడ్కోలు పోస్ట్ పెట్టిన అరగంటకే రైనా తన రిటైర్మెంట్ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపాడు. తనను నమ్మి ముందుకు నడిపించిన మిత్రుడైన ధోని ఇకపై ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడన్న ఎమోషన్లో అతడు ఇలా చేసి ఉండొచ్చని బోర్డు అధికారులు భావిస్తున్నారు.
తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతోనే రైనా రిటైర్మెంట్ గురించి బీసీసీఐ వెబ్సైట్లో శనివారం రాత్రి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అఫిషియల్గా ఆదివారం సమాచారం రావడంతో ఆ రోజు సాయంత్రం ప్రకటనను రిలీజ్ చేశారు.
Also Read :
పబ్జీ ఆడేందుకు ఫోన్ ఇవ్వలేదని బ్లేడ్తో గొంతు కోసుకున్నాడు