ఉద్యోగులకు షాక్.. ప్రైవేట్ కంపెనీలకు భారీ ఊరట..!
ప్రైవేట్ కంపెనీలకు భారీ ఊరట కల్పిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. లాక్డౌన్ వేళ ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేకపోతున్న
ప్రైవేట్ కంపెనీలకు భారీ ఊరట కల్పిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. లాక్డౌన్ వేళ ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేకపోతున్న ప్రైవేట్ కంపెనీలపై ఎలాంటి చర్యలకు ఆదేశించడం లేదని సుప్రీం వెల్లడించింది. జూలై చివరి వరకు ప్రైవేట్ కంపెనీలకు ఈ వెసులుబాటును కల్పించబోతున్నట్లు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగస్థులతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించుకోవాలని తన ఆదేశంలో న్యాయస్థానం పేర్కొంది.
అయిలే కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించగా.. ఆ సమయంలో ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలని కేంద్ర హోంశాఖ మార్చి నెలలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలు కంపెనీలు సుప్రీంను ఆశ్రయించాయి. ఈ పిటిషన్పై తాజాగా విచారణ జరిపిన సుప్రీం.. ఈ అంశంపై వివాదం సరికాదని తెలిపింది. పరిశ్రమలు, కార్మికులు ఒకరికి ఒకరు అవసరమని తన తీర్పులో వెల్లడించింది. ఇక ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.
Read This Story Also: ఇదొక దుర్మార్గపు చర్య: అచ్చెన్నాయుడి అరెస్ట్పై కేశినేని