రేషన్ షాపులవద్ద క్యూ.. సాఫీగా బియ్యం పంపిణీ ప్రక్రియ!
కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 2.80కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు ఉచితంగా
కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 2.80కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు ఉచితంగా 12 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమం సాఫీగా జరుగుతోందని పౌరసరఫరాల సంస్ధ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.
కాగా.. ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని, వాటిని వెంటనే పరిష్కరించినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రక్రియ బాగుందని అన్నారు. ఆదివారం నగర మేయర్ బొంతురామ్మోహన్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్తో కలిసి ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు రేషన్షాపుల్లో బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.