మరోమారు హిమాలయాలకు రజినీకాంత్!
సూపర్ స్టార్ రజనీకి దైవచింతన చాలా ఎక్కువ. నిత్యం దైవారాధనలో ఉండే ఆయన అప్పుడప్పుడు హిమాలయాల పర్యటనలకు కూడా వెళుతుంటారు. ఇప్పుడు కూడా రజనీకాంత్ మరోమారు హిమాలయాలకు వెళ్ళనున్నాడని విశేషంగా వినిపిస్తోంది. ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేసి మనోబలాన్ని పొందడానికి నిశ్చయించుకున్నాడట. గతంలోనూ రజనీకాంత్ హిమాలయాలకు వెళ్ళి మనోస్థైర్యాన్ని పొంది వచ్చిన సందర్భాలున్నాయని ఆయన అభిమానులు అంటున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. వీలు దొరికినప్పుడల్లా ఆయన హిమాలయలకు ఆధ్యాత్మకి యాత్రలు […]
సూపర్ స్టార్ రజనీకి దైవచింతన చాలా ఎక్కువ. నిత్యం దైవారాధనలో ఉండే ఆయన అప్పుడప్పుడు హిమాలయాల పర్యటనలకు కూడా వెళుతుంటారు. ఇప్పుడు కూడా రజనీకాంత్ మరోమారు హిమాలయాలకు వెళ్ళనున్నాడని విశేషంగా వినిపిస్తోంది. ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేసి మనోబలాన్ని పొందడానికి నిశ్చయించుకున్నాడట. గతంలోనూ రజనీకాంత్ హిమాలయాలకు వెళ్ళి మనోస్థైర్యాన్ని పొంది వచ్చిన సందర్భాలున్నాయని ఆయన అభిమానులు అంటున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. వీలు దొరికినప్పుడల్లా ఆయన హిమాలయలకు ఆధ్యాత్మకి యాత్రలు చేస్తూ ఉంటారు. ఇక రజినీకాంత్ రాఘవేంద్ర స్వామి వీర భక్తుడు. అందుకే తన వందో సినిమాగా ‘మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహాత్యం’ సినిమా చేసాడు. మరోవైపు ‘బాబా’ లాంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. తాజాగా రజినీకాంత్.. మురుగదాస్తో చేస్తున్న ‘దర్బార్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసాడు. ఆ తర్వాత సిరుతై శివ దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ గ్యాప్లోనే రజినీకాంత్.. మరోసారి హిమాలయలకు బయలు దేరి వెళ్లారు.
ఇంకో పదిరోజులు ఆయన అక్కడే ఉండనున్నారు. మాములు ప్రపంచానికి దూరంగా ఆధ్యాత్మికంగా గడపడానికి రజినీకాంత్…వీలు కుదిరినపుడల్లా.. హిమాలయాలకు వెళుతుంటారు. అక్కడ ఒత్తిడి నుంచి రిలీఫ్ అయ్యాక తిరిగొచ్చి కొత్త సినిమా స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. మరోవైపు రజినీకాంత్ హీరోగా నటించిన ‘దర్బార్’ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.