ట్రైలర్ టాక్: ఓ రూపం.. రెండు ఆత్మలు!
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కిస్తున్న బైలింగ్యువల్ చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్య సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. ఇందులో సన్నివేశాలు సస్పెన్స్, హారర్ కామెడీతో కూడిన వరుస సినిమాల్లో ‘నిను వీడని నీడను నేనే’ మరొకటి. యువ […]
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కిస్తున్న బైలింగ్యువల్ చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్య సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. ఇందులో సన్నివేశాలు సస్పెన్స్, హారర్ కామెడీతో కూడిన వరుస సినిమాల్లో ‘నిను వీడని నీడను నేనే’ మరొకటి.
యువ జంటైన సందీప్ కిషన్, అన్య సింగ్ అనుకోకుండా ఓ యాక్సిడెంట్కు గురవుతారు. హీరోయిన్ ప్రమాదం నుంచి తప్పించుకున్నా.. హీరో మాత్రం గాయపడతాడు. ఆ తర్వాత వరుసగా అతని జీవితంలో ఎదురైన సంఘటనలను ఎలా ఎదుర్కొన్నాడన్నది ఈ మూవీ థీమ్. అతడికి షాక్ కలిగేలా ఓ ఆత్మ(వెన్నెల కిషోర్) తన శరీరంలోకి ప్రవేశించిందని తెలుస్తుంది. అసలు ఎవరు ఆ ఆత్మ.? ఎందుకు సందీప్ కిషన్లోకి ప్రవేశిస్తుంది.? అది ప్రవేశించిన తర్వాత సందీప్ కిషన్ జీవితంలో జరిగిన పరిణామాలు ఏమిటనే.? ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.
‘పోలీసులకు మాత్రం దెయ్యం అంటే భయం ఉండదా? దెయ్యాల్ని పట్టుకోవడానికి మాకేమన్నా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారనుకుంటున్నారా?’ అంటూ పోసాని కృష్ణమురళి చెప్పిన డైలాగ్ను ఇందులో హైలైట్ చేశారు. ట్రైలర్ బట్టి చూస్తుంటే ఈ సినిమా సందీప్ కిషన్కి మంచి హిట్ ఇస్తుందని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.