ఎన్నికల్లో పోటీపై సందిగ్ధంలో సుమలత‌

బీజేపీ నేత ఎస్.ఎం.కృష్ణతో సుమలత శుక్రవారంనాడు భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేయాలా, ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. ‘నా నిర్ణయం ఏమిటనేది ఈనెల 18న ప్రకటిస్తాను’ అని తెలిపారు. మాండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం వల్ల కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతింటుందని ఆమె చెప్పారు. కాంగ్రెస్ నిర్ణయంతో మాండ్యలో కాంగ్రెస్ జాడలేకుండా పోయే అవకాశాలున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే […]

ఎన్నికల్లో పోటీపై సందిగ్ధంలో సుమలత‌
Follow us

| Edited By:

Updated on: Mar 15, 2019 | 9:02 PM

బీజేపీ నేత ఎస్.ఎం.కృష్ణతో సుమలత శుక్రవారంనాడు భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేయాలా, ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. ‘నా నిర్ణయం ఏమిటనేది ఈనెల 18న ప్రకటిస్తాను’ అని తెలిపారు. మాండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం వల్ల కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతింటుందని ఆమె చెప్పారు. కాంగ్రెస్ నిర్ణయంతో మాండ్యలో కాంగ్రెస్ జాడలేకుండా పోయే అవకాశాలున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే తనకు మద్దతుగా నిలిచారని, పార్టీ నిర్ణయంతో వారంతా అసంతృప్తితో ఉన్నారని సుమలత చెప్పారు. ‘నాకంటూ ఒక మిషన్ ఉంది. అది పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది’ అని కూడా ఆమె స్పష్టం చేశారు.