కరెక్షన్లు చేసిన లెక్కల మాస్టార్.. మెగాస్టార్ ముందుకు ‘ఉప్పెన’..!
మెగాస్టార్ మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ఉప్పెన'. లెక్కల మాస్టార్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన బుచ్చిబాబు సన
మెగాస్టార్ మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. లెక్కల మాస్టార్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాయి. హీరోయిన్ కీర్తి శెట్టి కూడా ఈ మూవీ ద్వారా టాలీవుడ్కి ఇంట్రడ్యూస్ అవుతోంది. ఇలా అందరూ కొత్త వాళ్లే ఉన్నప్పటికీ.. ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే ఇందులో సుకుమార్ హస్తం ఉండటం, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించడం, రాక్స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం. ఈ క్రమంలో ఈ సినిమా కోసం మైత్రీ సంస్థ భారీగానే ఖర్చు చేసింది. లాక్డౌన్ లేకపోయి ఉంటే రెండు నెలల క్రితమే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేది.
ఇక ఇది పక్కనపెడితే.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగ్లకు అనుమతి ఇచ్చింది. మరోవైపు థియేటర్లు జూలైలో గానీ ఆగష్టు నెలలో గానీ తెరిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఉప్పెన పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టింది మూవీ యూనిట్. ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమా షూటింగ్ను అంతా పూర్తి చేసిన బుచ్చిబాబు సన, 4 గంటల అవుట్ పుట్ను తయారు చేశారట. దాన్ని చూసిన లెక్కల మాస్టర్ కొన్ని సీన్లకు కత్తెర వేసి కరెక్షన్లు చేశారట. ఇక ఇప్పుడు ఈ సినిమాను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లారట. ఆయన చెప్పే సలహాలను బట్టి బుచ్చిబాబు ఫైనల్ అవుట్ పుట్ను తయారు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Read This Story Also: మొన్న వలస కార్మికులకు.. ఇవాళ నిసర్గ బాధితులకు.. హ్యాట్సాఫ్ సోనూ..!