మధ్యప్రదేశ్‌లో రంగంలోకి సింధియా!

కర్నాటకలో, గోవాలో కాంగ్రెస్‌ పార్టీకి గడ్డుకాలం నడుస్తుండటంతో అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఇప్పటి నుంచే జాగ్రత్తలు పడుతోంది. ఆ రెండు రాష్ట్రాల్లో లాగా చేదు అనుభవాలు ఎదురుకాకుండా ఉండేందుకు కాంగ్రెస్ యువనేత‌ జ్యోతిరాదిత్య సింధియా రంగంలోకి దిగారు. సింధియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను కలిసి విందులో పాల్గొన్నారు. సీఎంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోనూ విందులో పాల్గొని వారితో చర్చలు జరిపారు. కానీ ఈయనతో పాటు ఎంత మంది ఎమ్మెల్యేలు విందులో పాల్గొన్నారన్నది మాత్రం తెలియ రాలేదు. ఈ […]

మధ్యప్రదేశ్‌లో రంగంలోకి సింధియా!
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 12, 2019 | 6:15 PM

కర్నాటకలో, గోవాలో కాంగ్రెస్‌ పార్టీకి గడ్డుకాలం నడుస్తుండటంతో అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఇప్పటి నుంచే జాగ్రత్తలు పడుతోంది. ఆ రెండు రాష్ట్రాల్లో లాగా చేదు అనుభవాలు ఎదురుకాకుండా ఉండేందుకు కాంగ్రెస్ యువనేత‌ జ్యోతిరాదిత్య సింధియా రంగంలోకి దిగారు. సింధియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను కలిసి విందులో పాల్గొన్నారు. సీఎంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోనూ విందులో పాల్గొని వారితో చర్చలు జరిపారు. కానీ ఈయనతో పాటు ఎంత మంది ఎమ్మెల్యేలు విందులో పాల్గొన్నారన్నది మాత్రం తెలియ రాలేదు. ఈ విందులో ఎమ్మెల్యేల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. కమల్‌నాథ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, సంక్షేమ పథకాలు నియోజకవర్గాల్లో ఎంత వరకు అమలవుతున్నాయన్న విషయాన్ని సింధియా ఎమ్మెల్యేల దగ్గర ప్రస్తావించారు.