రణరంగంగా మారిన ఢిల్లీ.. 100 మంది విద్యార్థులు అరెస్ట్..!
పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఏఏకు వ్యతిరేకంగా.. ఆందోళన కారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణలో నాలుగు బస్సులు అగ్నికి ఆహుతైపోయాయి. మంటలను ఆర్పడానికి వచ్చిన నాలుగు ఫైరింజన్లను కూడా ఆందోళన కారులు ధ్వంసం చేశారు. కాగా.. పెద్ద సంఖ్యలో యూనివర్శిటీ విద్యార్థులు.. పోలీసులతో ఘర్షణకు దిగారు. వారిని అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ చేసి, బాష్పయువును […]
పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఏఏకు వ్యతిరేకంగా.. ఆందోళన కారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణలో నాలుగు బస్సులు అగ్నికి ఆహుతైపోయాయి. మంటలను ఆర్పడానికి వచ్చిన నాలుగు ఫైరింజన్లను కూడా ఆందోళన కారులు ధ్వంసం చేశారు. కాగా.. పెద్ద సంఖ్యలో యూనివర్శిటీ విద్యార్థులు.. పోలీసులతో ఘర్షణకు దిగారు. వారిని అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ చేసి, బాష్పయువును ప్రయోగించారు. అలాగే ఇప్పటికే యూనివర్శిటీలో పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.
అయితే.. అర్థరాత్రి మళ్లీ జమియా మిలియా యూనివర్శిటీలో ఆందోళనలు మిన్నంటాయి. వందలాది మంది పోలీసులు యూనివర్శిటీలో లోపలా, వెలుపలా పరిస్థితిని సమీక్షిస్తూ చేరుకున్నారు. దీంతో.. నేడు జామియా ఏరియాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా దక్షిణ ఢిల్లీలోని 15 మెట్రో స్టేషన్ల గేట్లు మూసి వేశారు అధికారులు. అలీగఢ్ ముస్లి యూనివర్మిటీలోనూ ఆందోళనలు తీరాస్థాయికి చేరాయి. పోలీసులపై విద్యార్థులు రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి, టియర్ గ్యాస్ను ప్రయోగించారు. జనవరి 5 వరకు జామియా యూనివర్సిటీ సెలవులను ప్రకటించింది యాజమాన్యం. దాదాపు 100 మంది విద్యార్థులను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. అర్థరాత్రి పోలీస్ హెడ్ క్వార్టర్ వద్ద విద్యార్థులు ఆందోళనలు చేశారు. దీంతో వారిని తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో విడిచిపెట్టారు. అలీగఢ్, మీరట్, సహన్పూర్లో ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. కాగా.. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీని ఖండించింది కాంగ్రెస్ పార్టీ.
MS Randhawa, PRO Delhi Police: All detained students have been released from Kalkaji and New Friends Colony. pic.twitter.com/1Plzfp3tfV
— ANI (@ANI) December 15, 2019
Ajay Anand, ADG law and order (Agra Zone) in Aligarh: Our personnel are deployed and situation is under control. All necessary steps will be taken to maintain law and order. pic.twitter.com/SVKCUjPXPP
— ANI UP (@ANINewsUP) December 15, 2019