ఏపీలో రూపాయి జీతం కథ..వైఎస్‌ఆర్, ఎన్టీఆర్, జగన్

ఇన్నాళ్లు సీఎంగా ఒక్క రూపాయి వేతనం తీసుకున్నది తెలుగు ఆరాథ్య నటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మాజీ సీఎం ఎన్టీఆర్ మాత్రమే అని మనందరికి తెలుసు. కానీ అంతకుముందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రిగా పనిచేస్తూ ఒక్క రూపాయి తీసుకొని పనిచేశాడన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో రాకముందే గుల్బార్గాలో డాక్టర్ చదివాడు.. ఎంబీబీఎస్ చేసిన ఆయన పులివెందులలో తన తండ్రి పేరుమీదుగా 70 పడకల ఆస్పత్రి ప్రారంభించి ఉచిత వైద్యం […]

ఏపీలో రూపాయి జీతం కథ..వైఎస్‌ఆర్, ఎన్టీఆర్, జగన్
Follow us

|

Updated on: Jun 01, 2019 | 6:06 PM

ఇన్నాళ్లు సీఎంగా ఒక్క రూపాయి వేతనం తీసుకున్నది తెలుగు ఆరాథ్య నటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మాజీ సీఎం ఎన్టీఆర్ మాత్రమే అని మనందరికి తెలుసు. కానీ అంతకుముందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రిగా పనిచేస్తూ ఒక్క రూపాయి తీసుకొని పనిచేశాడన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో రాకముందే గుల్బార్గాలో డాక్టర్ చదివాడు.. ఎంబీబీఎస్ చేసిన ఆయన పులివెందులలో తన తండ్రి పేరుమీదుగా 70 పడకల ఆస్పత్రి ప్రారంభించి ఉచిత వైద్యం అందించారు. రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకునేవారు. అప్పట్లో ఆయన్ని రూపాయి డాక్టరు అని కూడా అనే వారు. ఇక  1978లో వైఎస్ఆర్ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు.  అనంతరం నాటి అంజయ్య కేబినెట్‌లో వైద్యఆరోగ్యశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. నాడు రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకోవడంతో ముఖ్యంగా రాయలసీమ వ్యథను చూసి తాను మంత్రిగా ఒక్క రూపాయి మాత్రమే నామమాత్రపు వేతనం తీసుకుంటానని.. తన జీతాన్ని రాయలసీమ దుర్బిక్ష పరిస్థితులు తొలగించడానికి విరాళంగా తీసుకోవాలని సీఎంను కోరారు. దీనిపై అప్పటి సీఎం అంజయ్య వైఎస్ ను మెచ్చుకుంటూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అది పత్రికల్లో అచ్చయ్యింది.

రూపాయికే రాజ్యాంగబద్ధ పనుల్లో పనిచేసిన నేతలు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో తిరుగులేని, చెదిరిపోని స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు నవ్యాంధ్ర నూతన సీఎం జగన్‌కు కూడా రాష్ట్ర లోటు బడ్జెట్ ద‌ృష్ట్యా రూపాయికే సీఎంగా సేవలందిచాలని నిర్ణయించుకున్నారు. మరి జగన్ కూడా దివంగత నేతల మాదిరి మంచి పేరు తెచ్చుకుంటాడో.. లేదో వేచి చూడాలి