రివర్స్.. జార్ఖండ్‌లో సీఏఏ మద్దతుదారులపై లాఠీ చార్జ్…!

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓ వర్గం ఆందోళనలు చేపడుతుంటే.. మరోవైపు మద్దతుగా కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతున్నారు. అయితే ఈ ఆందోళనలు పలుచోట్ల హింసాకాండను తలపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా యూపీ, అసోం, వెస్ట్ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలలో సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. ఈ క్రమంలో అనేక చోట్ల హింస చెలరేగింది. అయితే తాజగా సీఏఏకు మద్దతుగా ర్యాలీ చేపట్టిన ఘటనలో కూడా హింసాత్మక ఘటనలు చేలరేగడం చర్చనీయాంశంగా మారింది. […]

రివర్స్.. జార్ఖండ్‌లో సీఏఏ మద్దతుదారులపై లాఠీ చార్జ్...!
Follow us

| Edited By:

Updated on: Jan 13, 2020 | 2:08 PM

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓ వర్గం ఆందోళనలు చేపడుతుంటే.. మరోవైపు మద్దతుగా కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతున్నారు. అయితే ఈ ఆందోళనలు పలుచోట్ల హింసాకాండను తలపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా యూపీ, అసోం, వెస్ట్ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలలో సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. ఈ క్రమంలో అనేక చోట్ల హింస చెలరేగింది. అయితే తాజగా సీఏఏకు మద్దతుగా ర్యాలీ చేపట్టిన ఘటనలో కూడా హింసాత్మక ఘటనలు చేలరేగడం చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే… జార్ఖండ్‌‌లోని గిరుధ్‌లో..ఆదివారం CAAకు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దాని అనుబంధ సంస్థలు పాల్గొన్నాయి. అయితే ఈ ర్యాలీపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లవర్షం కురిపించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని.. పరిస్థితి అదుపు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎంతకూ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో.. పోలీసులు లాఠీఛార్జ్‌ చేస్తూ.. భాష్పవాయువును ప్రయోగించారు.