మేడిపల్లిలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వాహనంపై రాళ్లు

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూజలు చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కాంగ్రెస్, బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే వాహనాలపై చెప్పులు, రాళ్లు విసిరారు. ఫార్మతో భూములు కోల్పోతుంటే పరామర్శించంకుండా, బెదిరింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులు, గ్రామస్థులు […]

మేడిపల్లిలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వాహనంపై రాళ్లు
Follow us

|

Updated on: Oct 15, 2020 | 12:42 PM

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూజలు చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కాంగ్రెస్, బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే వాహనాలపై చెప్పులు, రాళ్లు విసిరారు. ఫార్మతో భూములు కోల్పోతుంటే పరామర్శించంకుండా, బెదిరింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులు, గ్రామస్థులు చెరువు దగ్గరకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి సహా.. పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు.