భారీ లాభాలతో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు
ముంబై : నిన్న నష్టపోయిన సూచీలు గురువారం మళ్లీ లాభాల బాట పట్టాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ట్రేడింగ్ ముగిసేంత వరకు అదే ఊపును కొనసాగించాయి. సెన్సెక్స్ 412 పాయింట్లు మెరుగుపడి 38,545 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు లాభపడి 11,570 వద్ద ముగిశాయి. ఇండియా బుల్స్ హౌసింగ్, జీ ఎంటర్టైన్మెంట్, హెచ్సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్, కన్జ్యూమర్ గూడ్స్, ఐటీ తదితర స్టాకుల్లో కొనుగోళ్లతో మార్కెట్లు […]
ముంబై : నిన్న నష్టపోయిన సూచీలు గురువారం మళ్లీ లాభాల బాట పట్టాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ట్రేడింగ్ ముగిసేంత వరకు అదే ఊపును కొనసాగించాయి. సెన్సెక్స్ 412 పాయింట్లు మెరుగుపడి 38,545 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు లాభపడి 11,570 వద్ద ముగిశాయి. ఇండియా బుల్స్ హౌసింగ్, జీ ఎంటర్టైన్మెంట్, హెచ్సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్, కన్జ్యూమర్ గూడ్స్, ఐటీ తదితర స్టాకుల్లో కొనుగోళ్లతో మార్కెట్లు ఉత్సాహంగా ట్రేడ్ అయ్యాయి. అయితే ఓఎన్జీసీ, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో కంపెనీ షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.99 వద్ద ట్రేడవుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.84%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.36%), యస్ బ్యాంక్ (2.71%), యాక్సిస్ బ్యాంక్ (2.64%), సన్ ఫార్మా (2.49%).
టాప్ లూజర్స్: టాటా స్టీల్ (-1.73%), ఓఎన్జీసీ (-1.65%), బజాజ్ ఆటో (-1.53%), ఎన్టీపీసీ (-0.80%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.71%).