ఓరుగల్లు టూర్లో మాటల తూటాలు.. బీజేపీ రాష్ట్ర ఇంచార్జితో కలిసి టూరేస్తున్న బండి సంజయ్
గ్రేటర్పై గురిపెట్టి సీట్లు రాబట్టిన బీజేపీ.. ఇప్పుడు వరంగల్ కార్పొరేషన్పై కన్నేసింది. మొన్న ఓరుగల్లు టూర్తో రాజకీయాన్ని వేడెక్కించిన బండి సంజయ్.. ఇప్పుడు పార్టీ రాష్ట్ర ఇంచార్జితో కలిసి టూరేస్తున్నారు.
Bandi Sanjay is Touring : దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పట్టుకోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సుడిగాలి పర్యటన జరిపారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్చుగ్… పలు జిల్లాల్లో పర్యటిస్తూ టీఆర్ఎస్ పాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి.. నిజామాబాద్, ఖమ్మం టూర్ల తర్వాత… తాజాగా వరంగల్ జిల్లాలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. వరంగల్ భద్రకాళి ఆలయాన్ని పార్టీ నేతలు సందర్శించారు. స్మార్ట్ సిటీ నిధులను పక్కదారి పట్టించారని, అధికారపార్టీ నేతలు భద్రకాళి ఆలయంలో ప్రమాణానికి రావాలని మొన్ననే ఓరుగల్లు పర్యటనలో బండి సంజయ్ సవాల్ విసిరారు.
వరంగల్ టీఆర్ఎస్ నేతలు దీనిపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఆ వేడి చల్లారకముందే వరంగల్ వచ్చిన పార్టీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్చుగ్.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ని గద్దెదించి తీరతామన్న తరుణ్చుగ్…కేసీఆర్తో కేంద్ర నాయకత్వానికి ఎలాంటి సర్దుబాట్లు లేవని తేల్చిచెప్పారు. తొండి సంజయ్ని కాదు తొడగొట్టే సంజయ్నంటూ…ఆరోపణలు కొనసాగించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. టీఆర్ఎస్ నేతలు తన సవాలుకు జవాబు చెప్పలేకపోయారన్నారు.
రాబోయేది తమ ప్రభుత్వమేనని కమలం నేతలు ఢంకా బజాయిస్తున్నారు. బీజేపీ నేతల ప్రచారాలు, విమర్శలతో ఒరిగేదేం లేదని…వాళ్లవి పగటి కలలే అంటూ కౌంటర్ ఇస్తున్నారు టీఆర్ఎస్నేతలు. పోటాపోటీ విమర్శల మధ్యే బీజేపీ నేతలు వరంగల్ జిల్లాలో మరోసారి విమర్శలదాడి కొనసాగించారు.
ఇవి కూడా చదవండి :
పరప్పణ అగ్రహారంలో పాచికలు.. చిన్నమ్మ గూటిలో సమథింగ్ స్పెషల్.. తమిళక్షేత్రంలో రాజకీయ రణరంగం..