హీరోయిన్లు కావలెను..!

‘మిస్టర్ మజ్ను’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయేసరికి అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రంపై మరింత జాగ్రత్త పడుతున్నాడు. అఖిల్ తన తర్వాత చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేయబోతున్న విషయం తెలిసిందే. పూర్తి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని తెలుస్తోంది. మొదట కియారా అద్వానీ ని తీసుకోవాలనుకున్నా.. ఆమె డేట్స్ ఎడ్జస్ట్ కాలేదు. దానితో […]

హీరోయిన్లు కావలెను..!
Follow us

|

Updated on: Apr 29, 2019 | 4:32 PM

‘మిస్టర్ మజ్ను’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయేసరికి అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రంపై మరింత జాగ్రత్త పడుతున్నాడు. అఖిల్ తన తర్వాత చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేయబోతున్న విషయం తెలిసిందే. పూర్తి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని తెలుస్తోంది. మొదట కియారా అద్వానీ ని తీసుకోవాలనుకున్నా.. ఆమె డేట్స్ ఎడ్జస్ట్ కాలేదు. దానితో రష్మిక మందన్నాను హీరోయిన్ గా ఎంపిక చేశారని టాక్ వినిపించింది. అయితే అది కూడా ఫైనలైజ్ కాలేదట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.