శ్రీశైలంలో సస్పెండ్కు గురైన 9 మంది ఉద్యోగులకు ఊరట.. తిరిగి విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం
ఇటీవల శ్రీశైలం టెంపుల్లో మహా కుంభకోణం వెలుగుచుసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం 13 మందిని దేవాదాయ శాఖ సస్పెండ్ చేసింది.
ఇటీవల శ్రీశైలం టెంపుల్లో భారీ కుంభకోణం వెలుగుచుసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం 13 మందిని దేవాదాయ శాఖ సస్పెండ్ చేసింది. ఆర్జిత సేవా టికెట్ల డొనేషన్, కౌంటర్ పెట్రోల్బంకులో జరిగిన కుంభకోణంపై 31 మందిని అరెస్టు చేశారు పోలీసులు. 3నెలల్లో ఏసీబీ విచారణ పూర్తికావాల్సి ఉండగా.. ఆరునెలలైనా కొలిక్కి రాలేదు. ఇంకా విచారణ సాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొన్న 13మంది రెగ్యులర్ ఉద్యోగులపై వేటు వేసిన ప్రభుత్వం..మళ్లీ వారిని విధుల్లోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వులు ఇచ్చింది.
కాగా అభిషేకం, కుంకుమార్చన, శీఘ్రదర్శనంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. కోట్లలో ఆలయ ఆదాయానికి గండి కొట్టారు. దీనిపై భక్తులతో పాటు సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏసీబీ విచారణకు ఆదేశించినప్పటికీ.. విచారణ కొలిక్కిరాకపోవడం, మళ్లీ విధుల్లోకి తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.