Breaking : శ్రీశైల ఆలయ కుంభకోణం కేసులో 24 మంది అరెస్ట్..

రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క్రియేట్ చేసిన‌ శ్రీశైలం ఆల‌యంలో అభిషేకం, ఆర్జిత సేవల టికెట్లలో జరిగిన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన 24 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జె.వెంకట్రావు పేర్కొన్నారు. ఆల‌యంలో మొత్తం రూ.2.12 కోట్ల అవినీతి జరిగిందని..కాజేసిన‌ సొమ్ములో 83.40 లక్షల రూపాయలు, కారును స్వాధీనం చేసుకున్నామ‌ని వివ‌రించారు. నిందితులు 4 ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి..వాటి ద్వారా అభిషేకం టిక్కెట్ల అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుల్లో మళ్లీ కొందరిని కస్టడీలోకి తీసుకుని […]

Breaking : శ్రీశైల ఆలయ కుంభకోణం కేసులో 24 మంది అరెస్ట్..
Follow us

|

Updated on: Jun 02, 2020 | 3:49 PM

రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క్రియేట్ చేసిన‌ శ్రీశైలం ఆల‌యంలో అభిషేకం, ఆర్జిత సేవల టికెట్లలో జరిగిన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన 24 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జె.వెంకట్రావు పేర్కొన్నారు. ఆల‌యంలో మొత్తం రూ.2.12 కోట్ల అవినీతి జరిగిందని..కాజేసిన‌ సొమ్ములో 83.40 లక్షల రూపాయలు, కారును స్వాధీనం చేసుకున్నామ‌ని వివ‌రించారు.

నిందితులు 4 ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి..వాటి ద్వారా అభిషేకం టిక్కెట్ల అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుల్లో మళ్లీ కొందరిని కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జ‌రుపుతామ‌ని చెప్పారు. కాగా ఈ స్కామ్ లో దర్శిల్లీ, రూపేష్​లుగా సూత్రధారులు గుర్తించినట్లు వెల్ల‌డించారు. ఉద్యోగులు ఒక‌రిపై, ఒక‌రు ఫిర్యాదు చేసుకోవ‌డంతో ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.