శ్రీవారి సేవలో.. శ్రీలంక అధ్యక్షుడు
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కుటుంబ సమేతంగా.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చిన ఆయనకు.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాస రాజు స్వాగతం పలికారు. మైత్రిపాల సిరిసేన భార్య జయంతి పుష్ప కుమారి, ఇతర కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడకు వచ్చిన ఆయన రెండు రోజులు తిరుపతిలోనే ఉంటారు. దీంతో, ఆయనకు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కుటుంబ సమేతంగా.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చిన ఆయనకు.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాస రాజు స్వాగతం పలికారు. మైత్రిపాల సిరిసేన భార్య జయంతి పుష్ప కుమారి, ఇతర కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడకు వచ్చిన ఆయన రెండు రోజులు తిరుపతిలోనే ఉంటారు. దీంతో, ఆయనకు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.