ఇస్లామిక్ తీవ్రవాదులే… ఆ సూసైడ్ బాంబర్లు!
వరుస పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంకలో ఇవాళ ఆరు చోట్ల పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లలో 185 మంది చనిపోయారు. ఉన్మాదులు మూడు చర్చిలు.. మూడు స్టార్ హోటళ్లను టార్గెట్ చేశారు. అయితే సూసైడ్ బాంబర్లే ఈ మారణహోమానికి పాల్పడినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కొలంబోలోని షాంగ్రిలా హోటల్లో ఈనెల 20వ తేదీన ఇద్దరు వ్యక్తులు ఓ రూమ్ బుక్ చేసుకున్నారు. వారు రూమ్ నెంబర్ 616లోకి చెకిన్ అయ్యారు. అయితే హోటల్లోని సీసీటీవీ […]
వరుస పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంకలో ఇవాళ ఆరు చోట్ల పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లలో 185 మంది చనిపోయారు. ఉన్మాదులు మూడు చర్చిలు.. మూడు స్టార్ హోటళ్లను టార్గెట్ చేశారు. అయితే సూసైడ్ బాంబర్లే ఈ మారణహోమానికి పాల్పడినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కొలంబోలోని షాంగ్రిలా హోటల్లో ఈనెల 20వ తేదీన ఇద్దరు వ్యక్తులు ఓ రూమ్ బుక్ చేసుకున్నారు. వారు రూమ్ నెంబర్ 616లోకి చెకిన్ అయ్యారు. అయితే హోటల్లోని సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. ఆ ఇద్దరు అనుమానితులు సూసైడ్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. షాంగ్రిలా హోటల్లోని కాఫెటేరియా, కారిడర్ వద్ద వాళ్లు తమను తాము పేల్చుకున్నారు. పేలుళ్ల కోసం సీ-4 ఎక్స్పోజివ్స్ను వాడినట్లు తెలుస్తోంది. ఆ హోటల్ను పేల్చేందుకు సుమారు 25 కిలోల బాంబులు వాడారు. రూమ్లోకి ప్రవేశించిన పోలీసులు అక్కడ నుంచి కొన్ని వస్తువులను సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆ సూసైడ్ బాంబర్లు.. ఇస్లామిక్ తీవ్రవాదులు అని విచారణాధికారులు ఓ అంచనాకు వచ్చారు. అయితే వాళ్లు స్థానికులా లేక అంతర్జాతీయ టూరిస్టులు అన్న విషయాన్ని మాత్రం ఇంకా పోలీసులు నిర్ధారించలేదు.